యూఎస్ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ అందుకోవాలన్న అతడి కల సెమీస్కే పరిమితమైంది. యూఎస్ ఓపెన్ 2025 డబుల్స్ సెమీఫైనల్ పోరులో జో సలిస్బరీ-నీల్ స్కప్స్కీ ద్వయం చేతిలో యుకీ-మైకెల్ వీనస్ జోడీ 7-6 (2), 6-7 (5), 4-6 తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 2.53 గంటలపాటు సాగిన పోరులో ప్రతి పాయింట్ కోసం ప్రత్యర్థులు తీవ్రంగా పోరాడారు.