బీహార్లో వ్యక్తిని దారుణంగా హతమార్చారు. జెహానాబాద్(D) కాకో బ్లాక్ మార్కెట్లో కేవలం రూ.5 కోసం క్రూరంగా కొట్టి చంపేశారు. కూరగాయల వ్యాపారి మహమ్మద్ మొహ్సిన్ అమ్మకాలు సరిగ్గా లేక మార్కెట్ కమిటీ ఫీజు కింద రూ.15 డిమాండ్ చేయగా, అతను రూ.10 చెల్లిస్తానని చెప్పాడు. కమిటీ మెంబెర్కు మొహ్సిన్కు గొడవ జరిగి.. కోపంలో మొహ్సిన్ను హత్య చేశాడు. ఇంత జరుగుతున్నా, జరిగినా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. యథావిధిగా వ్యాపారం చేసుకోవడం గమనార్హం.