మూడు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా వేల్‌కుమార్

నార్వే వేదికగా జరిగిన ప్రపంచ స్పీడ్ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ ఆనంద్‌కుమార్‌ వేల్‌కుమార్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం నిర్వహించిన 42 కి.మీ మెన్స్‌ మారథాన్‌లో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు 1000 మీటర్ల స్ప్రింట్‌లోనూ స్వర్ణం, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్యం దక్కించుకుని ఈ ఛాంపియన్‌షిప్‌లో 2 సార్లు విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డు నమోదు చేశాడు. అలాగే 3 పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌‌‌గా నిలిచాడు.

సంబంధిత పోస్ట్