TG: హైదరాబాద్లోని సైబరాబాద్లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. శంకర్పల్లిలో ఓ వ్యాపారి సిబ్బంది నుంచి రూ.40 లక్షలు దోచుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ దోపిడీలో డ్రైవర్ మధుతో సహా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.17.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.