VIDEO: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు

AP: అనంతపురంలోని కొవ్వూరు నగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మాధవిలత అనే మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం ఆమె గుడికి వెళ్తున్నారు. బైక్ పై వచ్చిన దుండగులు చైన్ లాగడంతో ఆ మహిళ రోడ్డుపై పడిపోయారు. అనంతరం చైన్ లాక్కొని పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్