AP: విజయవాడ భవానీపురానికి చెందిన ఓ మహిళ తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న పల్లె కారులు, జాలర్లు గమనించి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను పోలీసు స్టేషన్కు తరలించారు.