మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గురిమళ్ళ గ్రామ సమీపంలోని చిన్న వాగులో గురువారం రెడ్యాతండాకు చెందిన పులిగుజ్జు సంపత్ అనే యువకుడు వాగు దాటుతూ గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. యువకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.