మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చెరువు తండాలో మంగళవారం కౌలు చేసిన భావి వద్ద వేప చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో వేప చెట్టు రెండు ముక్కలైంది. సమీపంలో పనిచేస్తున్న కూలీ సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.