మహబూబాబాద్: మార్ట్ లో చోరీ చేసిన మహిళలు.. సీసీ కెమెరాలో రికార్డ్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని సాయి మార్ట్ లో బుధవారం చోరీ జరిగినట్లు గుర్తించారు.
నలుగురు మహిళలు నిర్వాహకులకు తెలియకుండా తమ చేతివాటం ప్రదర్శించి వస్తువులు చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిల్వల్లో తేడా రావడంతో మార్ట్ నిర్వాహకులు సీసీ ఫుటేజీని పరిశీలించగా వస్తువులను మహిళలు తస్కరించినట్లుగా గుర్తించిన షాప్ నిర్వాకులు. నిఘా పెట్టి చోరీ చేసిన మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్