ఉపాధి హామీ కూలీలతో పనిలో పాల్గొన్న మంత్రి

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలతో మంత్రి సీతక్క కలిసి పనిలో పాల్గొన్నారు. వారికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్