వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట రోడ్డు లోలెవల్ బ్రిడ్జి వద్ద ఆదివారం రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాదన్నపేట చెరువు నిండడంతో, వరద ప్రవాహం వంతెన మీదుగా ఉద్ధృతంగా వెళ్తాంది. దీంతో నర్సంపేట, మాదన్నపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయి, పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.