వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం ఒక ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించాయి. గోపాల మిత్ర డా. అక్బర్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, కృత్రిమ గర్భధారణ (ఏఐ) ద్వారా మేలు జాతికి చెందిన ఈ దూడలు జన్మించాయి. ఈ అరుదైన సంఘటనతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.