సంగెం మండలం లోహిత గ్రామంలో ప్రమాదవశాత్తు గేట్వాల్వ్ సంపులో పడి మాసాని కనక మల్లు (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. వాటర్ ట్యాంకు సమీపంలో ఉన్న సంపులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడు పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందినవాడని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.