భద్రకాళీ ఆలయంలో కొబ్బరినీళ్లు విక్రయించడంపై విశ్వహిందూ పరిషత్ (VHP) ఫిర్యాదు చేయడంతో ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) సునీత స్పందించారు. కొబ్బరినీళ్ల అమ్మకాలపై విచారణ చేపట్టిన ఈవో, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునే టెండర్ పొంది, అనధికారికంగా కొబ్బరినీళ్లను ప్లాస్టిక్ బాటిళ్లలో విక్రయిస్తున్న టెండర్దారుడికి రూ. 15 వేల జరిమానా విధించారు. ఆలయ ప్రాంగణంలో కొబ్బరినీళ్లు అమ్మబడవు అని సూచిస్తూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.