తిరుమల దేవదేవుడి పవిత్రతను పెంచాలనేది బోర్డు నిర్ణయమని, కాటేజీలకు దేవుడి పేర్లు పెట్టాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నాణ్యతను పెంచినట్లు, ప్రసాదాలు పది రోజులైనా నిల్వ ఉంటున్నాయని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంతో పోల్చితే లడ్డూ ప్రసాదంలో చాలా మార్పులు చేసినట్లు తెలిపారు.