TG: రాష్ట్రంలో దళిత ఉద్యమం తీసుకొస్తామని, కాంగ్రెస్ దళిత వ్యతిరేక ప్రభుత్వమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దళితులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, అక్కడి దళితులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించాలని సూచించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.