అమెరికా అదనపు సుంకాలు విధించినా భారత్ వెనక్కు తగ్గలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ తన అవసరాలకనుగుణంగా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. ట్రంప్ 25% అదనపు సుంకం విధించడంతో భారత ఉత్పత్తులపై సుంకాలు 50%కి పెరిగాయి. ఎగుమతిదారుల కోసం ఉపశమన ప్యాకేజీ త్వరలో ప్రకటిస్తామని సీతారామన్ చెప్పారు.