తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను 'కాంగ్రెస్ బకాయి కార్డు' ఉద్యమంతో గుర్తుచేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు ఈ కార్డులను అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు.