రాజస్థాన్లోని జోధ్పూర్లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బట్టల దుకాణం నడుపుతున్న ఓ వ్యాపారి భవనం పైనుండి ఒక్కసారిగా పడిపోయాడు. వాటర్ తాగుతూ.. ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.