ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ వర్ష్నీ కుమారుడు అన్షుల్ వర్ష్నీ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తన మరణానికి కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించాడు. విడాకుల కోసం భార్య రూ.2 కోట్ల డిమాండ్ చేసిందని, కూతురు కూడా తనకు వ్యతిరేకంగా మారిందని అన్షుల్ పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని తాకవద్దని కూడా సూసైడ్ నోట్లో రాశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.