భారత్ అంతరిక్ష రంగంలో మరో ముందడుగు వేసింది. చంద్రయాన్-5 మిషన్లో జపాన్తో (ISRO-JAXA) కలిసి పనిచేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. చంద్రుడి ఉపరితలం, పర్యావరణంపై శాస్త్రీయ అవగాహనను పెంచుతుందని భావిస్తున్నారు. 250 కిలోల రోవర్ను జాబిల్లిపై దింపనున్నారు. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల వ్యూహాత్మక, శాస్త్రీయ సంబంధాలను మరింత బలపరచనుంది.