ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బకేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో ఉరి వేసుకుని కనిపించింది. 2025లో వివాహం చేసుకున్న ఈ మహిళను అత్తమామలు, భర్త అదనపు కట్నం కోసం వేధించారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.