ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలి అయిపోయింది. గుల్ ఫిజా అనే బాధితురాలికి ఏడాది క్రితం అమ్రోహాలోని కాలా ఖేడా గ్రామానికి చెందిన పర్వేజ్తో వివాహం జరిగింది. వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఫిజాను వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళతో బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది.