TG: నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించి, వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. నవీపేట పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే మహిళ తల, చేతి వేళ్ళు, మణి కట్టు ఇంకా దొరకకపోవడంతో నగ్న మృతదేహం కేసు మిస్టరీగా మారింది.