యూపీలోని బారాబంకి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పూజ అనే మహిళ, తన భర్తను చంపేందుకు ఈ-రిక్షా డ్రైవర్ కమలేశ్కు రూ.లక్ష సుపారీ ఇచ్చింది. జాతర నుంచి తిరిగి వస్తుండగా, పూజ, ఆమె 8 ఏళ్ల కొడుకు ముందే కమలేశ్ ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అయితే, బాలుడు ఈ హత్య విషయం పోలీసులకు చెప్పడంతో, పూజ, కమలేశ్లు అరెస్టయ్యారు. నిందితురాలికి తన మేనల్లుడితో వివాహేతర సంబంధం ఉందని, దానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను చంపించిందని విచారణలో తేలింది.