మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖలో జరుగుతున్న భారత్–దక్షిణాఫ్రికా మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ కొంత ఆలస్యమైంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్పై వరుసగా రెండు విజయాలు సాధించింది. విశాఖపట్నంలో ఇప్పటివరకు భారత మహిళల జట్టు ఐదు వన్డేలు ఆడగా, అన్ని మ్యాచ్లలోనూ విజయాన్ని సాధించింది.