భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు గెలవాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 34 మ్యాచ్లు జరగ్గా 20-13తో భారత్ పైచేయి సాధించింది. కాగా ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.