బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన భువనగిరి మండలంలో నష్టపోయిన పంటలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం పది గంటల వరకు తుక్కాపురం గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.