యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో పోలీసులు కిరాణా షాపులపై దాడులు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన సిగరెట్లు అమ్ముతున్న వీరయ్య అనే వ్యక్తిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పలు కంపెనీలకు చెందిన సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.