అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు దుర్మరణం చెందారు. బోటింగ్కు వెళ్ళినప్పుడు నీరసంగా ఉన్న ఆయన సముద్రంలోకి దూకి, మూర్ఛపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్తతో అస్సాం ప్రజలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గౌహతికి ఆయన భౌతికకాయం చేరుకున్నప్పుడు, 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయనకు నివాళులర్పించారు.