AP: ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://www.bse .ap.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే 9552300009 నెంబర్ ద్వారా విద్యార్థులు ఫలితాలతో పాటు మార్కుల మెమో కూడా పొందొచ్చు.