ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక విషయాలు వెల్లడించారు. ‘2024లో రష్యా చెర నుంచి 1358 మంది సైనికులు, పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చాం. ఇందుకు మా సైనికుల బృందం తీవ్రంగా శ్రమించింది. 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉంది’ అని జెలెన్స్కీ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా రష్యాతో యుద్ధం ముగియాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.