విశాఖకు రానున్న 200 ఎలక్ట్రిక్ బస్సులు!

69చూసినవారు
విశాఖకు రానున్న 200 ఎలక్ట్రిక్ బస్సులు!
AP: విశాఖపట్నంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నగరానికి నాలుగు విడతల్లో మొత్తం 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మొదటి విడతలో 50 బస్సులు త్వరలో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బస్సులను సింహాచలం, గాజువాక, మధురవాడ డిపోల నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపోలను ఏర్పాటు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్