AP: రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమి ఏడాది పాలనపై కేకే సర్వే గ్రామస్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించి తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. 2029 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి కొత్తగా గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు ఓడి పోతారని వెల్లడించింది. కాగా, గత ఎన్నికల్లో కేకే సర్వే అంచనాలు సంచలనం సృష్టించిన సంగతి విదితమే.