రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారు. 1,81,53,879 హెక్టార్లలో పంట నష్టం, 3,913 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి.