AP: విజయవాడలోని రైల్వే స్టేషన్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో ఓ రైల్వే భోగికి నిప్పు పెట్టారు. దీంతో భోగి మొత్తం కాలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గంజాయి మత్తులోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.