ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండడంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్దఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్మహల్ మంచు దెబ్బకు మాయమైనట్లు దర్శనమిచ్చింది.