కడప జిల్లా గౌస్ నగర్లో జరిగిన అల్లర్లపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. మరోవైపు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.