ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సీఎం చంద్రబాబు మంత్రి పదవిని కేటాయించారు. ఎటువంటి ఆడంబరాలకు వెళ్లకుండా ఎంతో సింపుల్ గా తన జీవితాన్ని కొనసాగిస్తుంటారు సంధ్యారాణి. మంత్రి అయిన తర్వాత సొంతంగా కారు కొనుగోలు చేయాలని భావించారు. దీనికోసం ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. ఆమె శాలరీ నుంచి 30 వాయిదాల్లో దీన్ని మినహాయించుకుంటారు. మంత్రి అయివుండి ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.