హీరో అశ్విన్ తాజాగా నటిస్తోన్న మూవీ వచ్చినవాడు గౌతమ్. ఈ మూవీ టీజర్ను చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్లోని AAA థియేటర్లో విడుదల చేసింది. అయితే ఈ కార్యక్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య పాల్గొంది. దీంతో ఈ మూవీలో రమ్య నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల రమ్య అక్క చిట్టి ఓ కస్టమర్ను అసభ్యకరంగా తిట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.