AP: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. గురువారం అల్లూరి, మన్యం, ఏలూరు, ప.గో జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు రాయలసీమలోని అనంతపురంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.