AP: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాబోయే రెండు రోజులలో ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అటు రాయలసీమ ప్రాంతాల్లో కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.