AP: గురువారం ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం అధిక ఉష్ణోగ్రత కర్నూలులో 40.7°C, అధిక వర్షపాతం అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ నమోదయిందన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.