రాయలసీమ, కోస్తా ప్రజలకు అలర్ట్

85చూసినవారు
రాయలసీమ, కోస్తా ప్రజలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మెరుపు వరదలు జనాలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి.అయితే ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు.ఆంధప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. మరో 24 గంటలపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్