AP: 'తల్లికి వందనం'పై వైసీపీ ఫేక్ ప్రచారానికి తెరలేపిందని మంత్రి లోకేశ్ అన్నారు. ఒకే ఆధార్ తో వందల మంది లబ్ధిదారులంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 'ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్య నివ్వం' అంటూ ట్వీట్ చేశారు.