ఏపీలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ తాలూకు గుర్తులన్నీ వరుసగా చెరిపేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ కీలక అంశంలో వేగంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలోపే ఆ ఐడియా అమల్లోకి రానుంది. అదే జరిగితే మరో వైసీపీ గుర్తు చెరిగిపోయినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు కేంద్ర బీజేపీ సాయంతో ఇకపై మూడు రాజధానుల అంశం లేకుండా ఒక గెజిట్ విడుదల చేయాలని టీడీపీ కేంద్రాన్ని కోరుతోంది.