సొంత నిధులతో తార్పాన్లు పంపిణీ చేసిన ఉప సర్పంచ్

75చూసినవారు
సొంత నిధులతో తార్పాన్లు పంపిణీ చేసిన ఉప సర్పంచ్
గూడెం కొత్త వీధి మండలంలోని దేవరపల్లి పంచాయతీ పరిధి సాగులు గ్రామానికి చెందిన రైతులకు శనివారం తార్పన్లు అల్లం పంపిణీ చేయడం జరిగిందని పంచాయతీ ఉప సర్పంచ్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. సాగులు గ్రామానికి చెందిన పదిమంది రైతులకు తార్పన్లు మరో పది మంది రైతులకు 10 కేజీల చొప్పున అల్లం సొంత నిధులతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఉప సర్పంచ్ కు సాగులు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్