విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని మదర్ థెరీసా సేవా సంఘం మరియు బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు త్యాడ. ప్రసాద్ పట్నాయక్ అన్నారు. శుక్రవారం విజయనగరంలో ఉన్న మదర్ థెరీసా సేవా సంఘం ఆధ్వర్యంలో అనంతగిరి మండలంలోని పల్లంవలస మండపర్తి బూడి బంగారమ్మపేటలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లో చదువుతున్న 150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ స్కేలు పంపిణీ చేశారు.