ప్రజల కష్టాలు తెలిసిన సిపిఎం అభ్యర్థులనే గెలిపించండి

79చూసినవారు
ప్రజల కష్టాలు తెలిసిన సిపిఎం అభ్యర్థులనే గెలిపించండి
జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులనే గెలిపించాలని అనంతగిరి జెడ్పిటిసి గంగరాజు కోరారు. శనివారం ఆయన మండలంలోని ఎగువశోభ పంచాయతీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే పరమావధిగా ప్రజలకష్టాలు తెలిసిన ఉద్యమ నాయకులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రోడ్లు, మంచినీరు, ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇప్పించి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్