డుంబ్రిగుడ మండలంలోని బోందుగుడ కొర్రాయికి మధ్య వంతెనకు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 5సంవత్సరాల క్రితం వంతెన నిర్మాణ పనులు చేపట్టి అర్థాంతరంగా విడిచిపెట్టేయడంతో కురుస్తున్న వర్షాలకు వరదనీరు నిలిచిపోయి ఉంటుందన్నారు. దీనితో వాహనచోదకులు వాహనదారులు ఎటువెళ్ళాలో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నామని గిరిజనులు తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని పలువురు గిరిజనులు శుక్రవారం కోరారు.